బీఆర్ఎస్​ప్రజలను మోసం చేసింది : ప్రణవ్

బీఆర్ఎస్​ప్రజలను మోసం చేసింది : ప్రణవ్
  • హుజూరాబాద్ ​కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్

జమ్మికుంట, వెలుగు : ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బీఆర్ఎస్​ రాష్ట్ర  ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ హుజూరాబాద్ అభ్యర్థి వొడితెల ప్రణవ్ ఆరోపించారు. మంగళవారం మాచనపల్లి, ఆబాదిజమ్మికుంట, పెద్దంపల్లి , జగ్గయ్యపల్లి, కేశవాపూర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు మహిళలు మంగళ హారతులు, డప్పుచప్పుల మధ్య స్వాగతం పలికారు. ప్రణవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్​ఉద్యమకారులను విస్మరించి ఉద్యమద్రోహులకు పట్టంకట్టారని విమర్శించారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో బీఆర్ఎస్​సర్కార్​ పూర్తిగా ఫెయిలైందన్నారు.

ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్యలకు ప్రభుత్వం కారణమైందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌‌ రెండు ఒకటేనని, కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోసం కుట్రలు చేస్తున్నాయన్నారు. మీ బిడ్డగా తనను ఆశీర్వదించి ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే, నియోజకవర్గాన్ని అభివృద్ధి  చేస్తానన్నారు. అనంతరం ఆబాదిజమ్మికుంట శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సమ్మిరెడ్డి, వెంకన్న, పూదరి రేణుక, సతీశ్‌‌రెడ్డి, సజ్జు, శివ, సలీం పాల్గొన్నారు.

ALSO READ : నేను చిటికేస్తే చాలు.. పోలీస్ అధికారికి అక్బరుద్దీన్ ఓపెన్ వార్నింగ్