కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు మరోసారి ప్రమాదం తప్పింది. మే 4వ తేదిన హెలికాఫ్టర్ ల్యాండ్ అయిన కొద్దిదూరంలో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది.
మే2 వ తేదిన ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరు నుంచి కోలార్ కి హెలికాప్టర్ లో వెళుతుండగా 100 అడుగుల ఎత్తులో రాబందు తాకింది. దీంతో ముందు వైపు అద్దానికి పగుళ్లు వచ్చాయి. ప్రమాదాన్ని గుర్తించిన పైలెట్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10 న జరగనుండగా, మే 13న ఫలితాలు విడుదల కానున్నాయి. పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ఉండనుంది. కాగా రాజకీయ పార్టీలు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 224 అసెంబ్లీ సీట్లు ఉన్న కన్నడ నాట ఈ సారి అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి.