- పెట్రో ధరల పెంపుపై ప్రియాంక ఫైర్
న్యూఢిల్లీ: హవాయి చెప్పులేసుకున్నోళ్లను విమానంలో ప్రయాణించేలా చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ సర్కారు.. పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి వాళ్లను కనీసం బండ్ల మీద కూడా పోనియ్య కుండా చేసిందని కాంగ్రెస్ లీడర్ ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. పెట్రో ధరలు విపరీతంగా పెంచడంతో మధ్యతరగతి ప్రజలకు రోడ్డు ప్రయాణం కష్టంగా మారిందని ఆమె సోమవారం ట్వీట్ చేశారు. విమానాలకు విక్రయించే టర్బైన్ ఇంధనం ధరల కంటే కార్లు, బండ్లలో వాడే పెట్రోల్ రేటు 33 శాతం ఎక్కువగా ఉందన్నారు. బీజేపీ ఖరీదైన రోజులు తెచ్చిందని హ్యాష్ ట్యాగ్ను ప్రియాంక జత చేశారు.