రోడ్లపై వరి నాట్లు వేసి నిరసన కాంగ్రెస్ నాయకులు

రోడ్లపై వరి నాట్లు వేసి నిరసన కాంగ్రెస్ నాయకులు

లక్సెట్టిపేట, వెలుగు: మండలంలోని పాత కొమ్ము గూడెం గ్రామంలో బురదమయమైన రోడ్లపై శుక్రవారం కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. రోడ్లపై ఎంతోమంది వాహనదారులు కిందపడి తీవ్ర గాయాల పాలైనప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 గ్రామాన్ని ఎమ్మెల్యే దివాకర్ రావు దత్తత తీసుకున్నా అభివృద్ధి జరుగలేదన్నారు. కార్యక్రమంలో   సురేశ్, మల్లయ్య, రవి, తిరుపతి, చంద్రయ్య పాల్గొన్నారు.