బోధన్, వెలుగు : సన్నవడ్లకు మద్దతు ధరతోపాటు బోనస్ అందజేస్తున్నందున బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం కాంగ్రెస్ శ్రేణులు సీఎం రేవంత్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ప్రభుత్వ సలహాదారుడు, ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా డీసీసీ డెలిగేట్గంగాశంకర్ మాట్లాడుతూ వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.
తడిసిన వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆవేదన చెందాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పాషామొనొద్దీన్, శివాలయం చైర్మన్ హరికాంత్ చారి, మున్సిపల్ మాజీ చైర్మన్ఎల్లయ్య, పట్టణ యుత్ అధ్యక్షుడు తలారి నవీన్, నాయకులు దామోదర్ రెడ్డి, శరత్ రెడ్డి, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
