నిర్మల్ జిల్లాలో కేటీఆర్ టూర్.. హెలిప్యాడ్ దగ్గర ఉద్రిక్తత

నిర్మల్ జిల్లాలో కేటీఆర్ టూర్.. హెలిప్యాడ్ దగ్గర ఉద్రిక్తత

నిర్మల్  జిల్లా దిలావర్ పూర్ మండలం గుండంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఎత్తి పోతల ప్రాజెక్టులో భాగంగా 27వ ప్యాకేజీ ప్రారంభోత్సవం కోసం మంత్రి కేటీఆర్ వచ్చారు. అదే సమయంలో  ఒక్కసారిగా అక్కడికి  డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు,  కాంగ్రెస్ నేతలు వచ్చారు .  ఆయనతో పాటు కాంగ్రెస్ నేతలను అడ్డుకుని అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. పూర్తి కానీ ఎత్తిపోతల ప్రాజెక్టును ఎలా ప్రారంభిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీహరి రావు.

Also Read :- లంచం ఇస్తేనే పంట రుణాల రెన్యువల్

మరో వైపు  నిర్మల్  జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా  విపక్ష నేతల ముందస్తు అరెస్ట్  కొనసాగుతోంది. భైంసాలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవీ, రాష్ట కార్యవర్గ సభ్యులు మోహన్ రావు పటేల్, బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. అక్రమ అరెస్ట్ లను ఖండించారు బీజేపీ నేతలు.