సోనియా కుటుంబాన్ని బద్ నాం చేస్తున్రు.. వనపర్తిలో ధర్నా

సోనియా కుటుంబాన్ని బద్ నాం చేస్తున్రు.. వనపర్తిలో ధర్నా

వనపర్తి, వెలుగు: సోనియా గాంధీ కుటుంబాన్ని బద్​నాం చేస్తున్నారని కాంగ్రెస్​ నేతలు విమర్శించారు. నేషనల్​ హెరాల్డ్ పత్రికతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద పెట్టిన కేసులను ఢిల్లీ హైకోర్టు కొట్టేసిన సందర్భంగా గురువారం బీజేపీ ఆఫీస్​ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి మాట్లాడారు. 

నేషనల్​ హెరాల్డ్​ పత్రిక విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకున్నా గాంధీ కుటుంబాన్ని బద్​నాం చేయాలని చూస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారని, రాజీవ్​గాంధీని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారని గుర్తు చేశారు. ఏఎంసీ చైర్మన్  శ్రీనివాస్​గౌడ్, ధనలక్ష్మి, రాజేంద్రప్రసాద్, శంకర్​నాయక్, చంద్రమౌళి పాల్గొన్నారు.