జూబ్లీహిల్స్లో మంత్రి వివేక్ తో కలిసి ప్రచారం

 జూబ్లీహిల్స్లో మంత్రి వివేక్ తో కలిసి ప్రచారం

నర్సాపూర్ జి, వెలుగు: జూబ్లీహిల్స్​లో కాంగ్రెస్​50 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుస్తుందని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు, సమతా ఫౌండేషన్​చైర్మన్, గొల్లమడ గ్రామానికి చెందిన సమతా సుదర్శన్​ అన్నారు. 

శనివారం ఆయన రాష్ట్ర కార్మిక, మైనింగ్​శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి జూబ్లీహిల్స్​నియోజకవర్గంలోని షేక్​పేట్​లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మంత్రి వివేక్​వెంకటస్వామికి ఇన్​చార్జి బాధ్యతలు ఇవ్వడంతోనే కాంగ్రెస్ గెలుపు ఖాయమైందని అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు.