సర్వే ఆధారంగానే కాంగ్రెస్ టికెట్లు : డీసీసీ ప్రెసిడెంట్ నగేశ్ రెడ్డి

సర్వే ఆధారంగానే కాంగ్రెస్ టికెట్లు : డీసీసీ ప్రెసిడెంట్ నగేశ్ రెడ్డి

ఆర్మూర్, వెలుగు:  పూర్తి స్థాయిలో సర్వే చేసి అర్హులైన పార్టీ నాయకులకే కాంగ్రెస్​ పార్టీ కౌన్సిలర్​ టికెట్​ కేటాయిస్తుందని జిల్లా కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షులు నగేశ్​ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆర్మూర్​ టౌన్​ కాంగ్రెస్​ ప్రెసిడెంట్​, మార్కెట్​ కమిటి చైర్మన్​ సాయిబాబాగౌడ్ అధ్యక్షతన బుధవారం ఆర్మూర్​ లో కాంగ్రెస్​ పార్టీ టౌన్​ మీటింగ్​ నిర్వహించారు. 

అంతకుముందు ఆశావహుల నుంచి కౌన్సిలర్​ టికెట్​ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా 147 మంది తమ దరఖాస్తులను అందజేశారు. అనంతరం డీసీసీ ప్రెసిడెంట్​ నగేశ్​​ రెడ్డి  మాట్లాడుతూ.... అభ్యర్థుల ఎంపిక, విజయం సాధించేందుకు తీసుకోవాల్సిన కార్యాచరణపై పార్టీ ఆదేశాల ప్రకారమే జరుగుతుందన్నారు.  అభ్యర్థుల పేర్లను  టీపీసీసీకి కు పంపిస్తామని తుది జాబితాను పార్టీ  అధిష్టానం ప్రకటిస్తుందన్నారు. 

అధిష్టానం ఎవరికి టిక్కెట్ ఇచ్చిన ఆ అభ్యర్థి గెలుపుకోసమే పార్టీ శ్రేణులు పనిచేయాలని చెప్పారు. పార్టీ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడాలని, పార్టీ  నిర్ణయాలను వ్యతిరేకించే వారిపై చర్య తీసుకుంటామన్నారు. 

సమావేశంలో ఆర్మూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి, మార చంద్రమోహన్​, ఏబీ చిన్నా,  నాయకులు మోత్కురి లింగాగౌడ్​, సంజయ్ సింగ్ బబ్లు, పండిత్ పవన్, అయ్యప్ప శ్రీనివాస్, షేక్​ మున్నా, విట్టం జీవన్ , ఖాందేశ్​ శ్రీనివాస్​, మహమూద్ అలీ, రేగుల్ల సత్యంనారాయణ పాల్గొన్నారు.