
న్యూఢిల్లీ: సోనియా గాంధీ నాయకత్వంలో బీజేపీని కచ్చితంగా ఓడిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ అన్నారు. కేరళలో వెటరన్ కాంగ్రెస్ లీడర్ పీసీ చాకో ఆ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్లో గ్రూపిజం ఎక్కువైందని పీసీ చాకో అన్నారు. దీంతో ఆయన విమర్శలపై ఆనంద్ శర్మ స్పందించారు. అధినేత్రి సోనియా నాయకత్వంలో కాంగ్రెస్ బలంగా ఉందని, బీజేపీని ఓడిస్తామని స్పష్టం చేశారు. గ్రూపిజం గురించి తప్పుడు అభిప్రాయాలు తగదని.. కాంగ్రెస్లో అంతర్గత చర్చలకు ఎప్పుడూ ఆస్కారం ఉంటుందన్నారు.