కేసీఆర్ ​మళ్లీ గెలిస్తే నిరుద్యోగుల బతుకులు ఆగం : షబ్బీర్ ​అలీ

కేసీఆర్ ​మళ్లీ గెలిస్తే నిరుద్యోగుల బతుకులు ఆగం : షబ్బీర్ ​అలీ

నిజామాబాద్, వెలుగు: కేసీఆర్​ గవర్నమెంట్​మళ్లీ వస్తే నిరుద్యోగ యువత బతుకులు ఆగమవుతాయని కాంగ్రెస్​అర్బన్​అభ్యర్థి షబ్బీర్​అలీ వాపోయారు. గురువారం ఆయన నామ్​దేవ్​వాడలో కార్నర్​ మీటింగ్​లో ప్రసంగించారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగమని రెండుసార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్​ నిరుద్యోగులను దారుణంగా మోసం చేశారన్నారు. నిరుద్యోగ యువతి ప్రవళిక సూసైడ్​ చేసుకుంటే, ప్రేమ విఫలమైందంటూ తప్పుడు ప్రచారం చేసి ఆమె కుటుంబాన్ని రోడ్డుకీడ్చారన్నారు.

కాంగ్రెస్​గవర్నమెంట్​వస్తేనే ఉద్యోగాలు వస్తాయన్నారు. యువతే కాంగ్రెస్​ను గెలిపించే బాధ్యత  తీసుకోవాలన్నారు. ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకునే కేసీఆర్​ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తారీకున జీతాలు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. పాలిటెక్నిక్​ గ్రౌండ్​లో మార్నింగ్​ వాక్​లో ఓటర్లను కలిసి గెలిపించాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులతో సమావేశమయ్యారు. గడుగు గంగాధర్, నరాల రత్నాకర్, రామకృష్ణ, దయాకర్, నజీబ్​అలీ, శరత్, ప్రవీణ్​గౌడ్, వేణుగౌడ్​ పాల్గొన్నారు.