రాహుల్​ యాత్రకు ప్రచారం వచ్చింది కానీ...ఓట్లు రాకపోవచ్చు: కాన్రాడ్ సంగ్మా

రాహుల్​ యాత్రకు ప్రచారం వచ్చింది కానీ...ఓట్లు రాకపోవచ్చు:  కాన్రాడ్ సంగ్మా
  • రాహుల్​ యాత్రకు ప్రచారం వచ్చింది కానీ...ఓట్లు రాకపోవచ్చు
  • మేఘాలయ సీఎం  కాన్రాడ్ సంగ్మా

షిల్లాంగ్: ఈశాన్య రాష్ట్రాల గుండా సాగిన కాంగ్రెస్‌‌‌‌ ‘భారత్‌‌‌‌ జోడో న్యాయ్‌‌‌‌ యాత్ర’ దేశ మీడియాలో సంచలనం సృష్టించినా.. ఆ పార్టీకి ఓట్లు మాత్రం రాకపోవచ్చని మేఘాలయ సీఎం, నేషనల్‌‌‌‌ పీపుల్స్‌‌‌‌ పార్టీ చీఫ్​ కాన్రాడ్‌‌‌‌ సంగ్మా అన్నారు. ‘‘ఈ యాత్ర కోసం కాంగ్రెస్ చాలా శక్తిని, వనరులను వెచ్చించింది.. అయితే ఇది ఓట్లు , సీట్లుగా మారకపోవచ్చు. వారు కోరుకునే ఫలితాన్ని పొందుతారని నేను అనుకోవట్లేదు. యాత్రకు మీడియాలో బజ్ క్రియేట్​కావడం కంటే ఎన్నికల్లో సీట్లు గెలవడం చాలా పెద్ద సంగతి. 

కాంగ్రెస్ పార్టీలో  సంస్థాగతంగా చాలా సమస్యలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా పెద్దపెద్ద నాయకులే కాకుండా.. గ్రౌండ్​లెవల్​లో కార్యకర్తలు కూడా పార్టీని వీడుతున్నరు. వారు వీటన్నింటిని పరిష్కరించుకొవాలి.. ముందు ఇంటిని చక్కదిద్దుకోవాలి” అని సంగ్మా సూచించారు.