దుబ్బాకలో రింగ్‌‌‌‌ రోడ్డు నిర్మాణంతోనే ట్రాఫిక్ కట్టడి

దుబ్బాకలో రింగ్‌‌‌‌ రోడ్డు  నిర్మాణంతోనే ట్రాఫిక్ కట్టడి

దుబ్బాక, వెలుగు:  దుబ్బాక పట్టణంలో ట్రాఫిక్ రోజు రోజుకు పెరిగిపోతుందని రింగ్ రోడ్డు నిర్మాణంతోనే దీనికి పరిష్కారం దొరుకుతుందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. రింగ్‌‌‌‌ రోడ్డు గురించి ఆర్‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌బీ అధికారులతో ఆయన మంగళవారం హైదరాబాద్‌‌‌‌ లో  సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  సెగ్మెంట్‌‌‌‌లో అవసరమైన నూతన రోడ్ల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.  

మండల పరిధిలోని హబ్షీపూర్​ నుంచి దుబ్బాక వరకు నాలుగు లేన్ల రోడ్డుకు, మిరుదొడ్డి మండలం అందె గ్రామం నుంచి దుబ్బాక మండలం తిమ్మాపూర్​వరకు డబుల్ రోడ్​నిర్మాణ ప్రతి పాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.  నిర్మాణంలో ఉన్న రోడ్ల స్థితి గతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సమీక్ష సమావేశంలో ఆర్​అండ్​బీ ఈఈ బాల ప్రసాద్​, డీఈ వెంకటేశం, ఏఈఈ శ్రీనివాస్​ పాల్గొన్నారు.