
- తొలి దశలో 15 మంది అభ్యర్థుల జాబితా విడుదల
ఖైరతాబాద్,వెలుగు: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన భారత్ పార్టీ పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ వెంకటేశ్ కసబే తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్అధికారంలోకి వస్తే తెలంగాణకు దళిత సీఎంను చేస్తానని చెప్పి కేసీఆర్మాట తప్పారని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీ ఓట్లకోసం హామీలు ఇవ్వడమే తప్ప అమలు సాధ్యం కాదన్నారు.
తమ పార్టీ తరపున తొలిదశలో 15 మంది అభ్యర్థులను ఎంపిక చేశామని,అనంతరం వారి జాబితాను ప్రకటించారు. పార్టీ తెలంగాణ ఇన్చార్జి బాబూరావు గైక్వాడ్గజ్వేల్,జుక్కల్లో పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. రెండోదశ అభ్యర్థుల జాబితా త్వరలోనే ప్రకటిస్తామన్నారు. ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్రలో పోటీ చేశామని, తెలంగాణలో అన్నిస్థానాల్లో తమ అభ్యర్థులు పోటీలో ఉంటారని చెప్పారు. ఈ సమావేశంలో పలువురు బహుజన భారత్ పార్టీ నేతలు పాల్గొన్నారు.