మళ్లీ పెరిగిన గ్యాస్ ధర..15 రోజుల్లో రెండోసారి

మళ్లీ పెరిగిన గ్యాస్ ధర..15 రోజుల్లో రెండోసారి

మరోసారి వంట గ్యాస్ సిలిండర్ రేట్లు పెరిగాయి. 15 రోజుల్లోనే ఏకంగా రెండు సార్లు రేట్లు పెంచాయి చమురు కంపెనీలు. డిసెంబర్ 2న ఒక్కో గ్యాస్ సిలిండర్ పై రూ. 50 పెంచిన ఆయిల్ కంపెనీలు… ఇవాళ మరో రూ.50  పెంచుతు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధానిలో ప్రస్తుతం రూ.644  ఉన్న సబ్సిడీ సిలిండర్ రేటు  రూ. 694 కు పెరిగింది. 5 కేజీల సిలిండర్ పై రూ.18, 19 కేజీల సిలీండర్ పై రూ. 36.50 పెంచారు. పెరిగిన ధరలు ఇవాళ్టి నుంచి అమల్లోకి వస్తాయి. ఎల్పీజీ సిలిండర్ రేటు ఒక్కో రాష్ట్రంలో ఉంటాయి.

దేశంలో మొదటి సారి భారీగా తగ్గిన కరోనా కేసులు