- వైరస్ భయంతో ఆర్థిక అస్థిరత పెరుగుతుందనే టెన్షన్
- జాబ్ లాస్, శాలరీ కట్స్పై చాలా మందిలో ఆందోళన
- నార్మల్ లైఫ్లో భారీ మార్పులు తప్పవన్న సైకాలజిస్టులు
- కరోనా వార్తలకు దూరంగా ఉండాలని సూచన
ముంబై: కరోనా ఎఫెక్ట్ ముగిసినా మళ్లీ తమ జీవితాలు నార్మల్కు ఎప్పుడు వస్తాయో అని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. కొందరైతే తమ ఫైనాన్షియల్ సిట్యువేషన్ ఎలా ఉంటుందో అని టెన్షన్ పడుతున్నారు. ఇంకొందరైతే జాబ్ ఉంటుందా? పోతుందా? అనే కన్ఫ్యూజన్లో పడిపోతున్నారు. మరికొందరు శాలరీ తగ్గించేస్తారేమో అని బెంగ పెట్టుకుంటున్నారు. ఇవన్నీ కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది జనం ప్రస్తుతం ఫేస్ చేస్తున్న భయాలు. సైకాలజిస్టులు ఏం చెబుతున్నారంటే కరోనా క్రైసిస్ అనేది ఎకనామిక్, ఫైనాన్షియల్ అస్థిరతకు దారి తీస్తోందని, దీని వల్ల చాలా మంది నార్మల్ లైఫ్ మారిపోతుందని, దాని ప్రభావం వారి మెంటల్ హెల్త్ పైనా పడుతుందని చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా లాక్ డౌన్ మొదలవ్వగానే గ్రాసరి షాపుల్లో సరుకులు కొనుగోలు చేసేందుకు జనం ఎగబడటం గురించి వారు ప్రస్తావిస్తున్నారు. వేరే వారి నుంచి వైరస్ తమకు ఎక్కడ వస్తుందో అని చాలా మంది ఇప్పుడు అబ్రెసివ్ కంపల్సివ్ డిజార్డర్(ఓసీడీ)కు గురవుతున్నారు.
మెంటల్ హెల్తే మెయిన్ రీజన్
జనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మెంటల్ హెల్త్కు సంబంధించినదే. ఇది అనేక రకాలుగా వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది. దీనికి మొదటి ఉదాహరణ వర్క్ ఫ్రం హోం. ఇంటి నుంచి పనిచేయడం చాలా సులువుగా ఉంటుందని మొదట ఎక్కువ మంది భావించారు. కానీ, రానురాను పరిస్థితులు దారుణంగా మారిపోతున్నాయి. ఆఫీస్ టైమ్ కంటే మించి ఎక్కువ సమయం ల్యాప్ టాప్లతో కుస్తీ పట్టాల్సి వస్తోంది. దీంతో తాము ఓవర్గా వర్క్ చేస్తున్నామనే ఫీలింగ్ వారిలో కలుగుతోంది. కానీ బాస్ గానీ, కో వర్కర్స్ గానీ తాము పని చేస్తున్నామని గుర్తించే పరిస్థితి లేకపోవడం వారిలో అసంతృప్తిని కలిగిస్తోంది. ఒకవేళ ఏదైనా పనిలో ఉండి కాల్ కు గానీ, ఈ మెయిల్కుగానీ రెస్పాండ్ అవ్వలేదా.. పనిని సీరియస్గా తీసుకోవడం లేదని కో వర్కర్స్ నుంచి వెక్కిరింపులు ఎదురవుతున్నాయి. వీటన్నిటి వల్లా పర్సనల్ లైఫ్ కూడా దెబ్బతింటోంది.
దెబ్బతింటున్న రిలేషన్స్
కరోనా ఎఫెక్ట్ వల్ల చాలా మంది బలవంతంగా సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండటంతో చాలా మందితో ఫిజికల్ రిలేషన్ దెబ్బతింటోంది. ఒంటరితనం అనేది ప్రపంచంలో ఉన్న అతి పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ అని, ప్రస్తుతం దాని ప్రభావం చాలా ఎక్కువగా పెరుగుతోందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. మన వారికి దూరంగా ఉండటం కూడా చాలా ఇబ్బందులకు గురిచేస్తోంది. వీడియో కాల్స్ వంటివి ఉన్నా.. అవి కొంత వరకే మనల్ని ప్రశాంతంగా ఉంచగలవు. ఐసోలేషన్లో చాలా టైం ఉంటున్నా సరే మన వారితో గడిపే పరిస్థితి లేకపోవడం మెంటల్గా టెన్షన్ పెంచుతోంది.
కరోనా న్యూస్కు దూరంగా ఉండాలి
కరోనా గురించిన వార్తలు చదవడం, చూడటం, వినడం సాధ్యమైనంత వరకూ తగ్గించాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. రోజుకు ఒకటి రెండు సార్లు మాత్రమే కరోనాకు సంబంధించి న్యూస్ తెలుసుకోవాలని చెప్పారు. తరచు కరోనాకు సంబంధించిన వార్తలు తెలుసుకోవడం వల్ల ఆందోళన పెరుగుతుందంటున్నారు. ఈ టైమ్లో చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెబుతున్నారు. కరోనా గురించి పెద్దవాళ్లు టెన్షన్ పడుతున్నట్టు కనిపిస్తే.. పిల్లలు కూడా నెర్వస్ గా ఫీలవుతారని, లాంగ్ టర్మ్లో చిన్నారులపై ఇది నెగెటివ్ ప్రభావం చూపిస్తుందని చెప్పారు.
జాబ్ లాస్.. శాలరీ కట్ గురించే బెంగ
కరోనా వైరస్ తగ్గిపోయినా ఆ తర్వాత తమ పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. కంపెనీల గ్రౌత్ తగ్గిపోయి చాలా మంది జాబ్ పోతుందని, శాలరీ తగ్గిపోతుందని ఆందోళన కనిపిస్తోంది. ఈ విషయంలో సాధ్యమైనంత వరకూ ట్రాన్స్పరెంట్గా ఉండటం మంచిదని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. రీజన్ఏమిటనేది అందరికీ తెలిసిందే కాబట్టి ఈ విషయంలో గౌరవంగా వ్యవహరించాలని చెబుతున్నారు.