మంచిర్యాల, వెలుగు: గవర్నమెంట్స్కూళ్లలో పిల్లలకు వండి పెట్టాల్సిన మిడ్ డే మీల్స్రైస్ను ఎలుకలు, పందికొక్కులు బుక్కినయట! అదీ పది, ఇరవై క్వింటాళ్లు కాదు, ఏకంగా రూ.30లక్షల విలువైన బియ్యాన్ని స్వాహా చేశాయట! వినడానికి వింతగా ఉన్నా, నిజంగా ఇదే జరిగిందని నమ్మించే ప్రయత్నం చేశారు ఆఫీసర్లు. పెద్దాఫీసర్లు కన్నెర్రచేయడంతో ఇప్పుడు తప్పును దిద్దుకునే పనిలో పడ్డారు.ప్రభుత్వం నిరుడు లాక్డౌన్పెట్టడంతో ఏడాదికి పైగా స్కూళ్లు మూతపడడం తెలిసిందే. దీంతో స్కూళ్లకు సప్లై చేసిన మిడ్ డే మీల్స్రైస్ అలాగే ఉండిపోయాయి. బియ్యానికి పురుగులు పట్టి ఖరాబు కావడంతో వేలం ద్వారా అమ్మేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మంచిర్యాల జిల్లాలో 2019–-20కి సంబంధించిన 2,337 క్వింటాళ్లు, 2020-–21 బాపతు 667 క్వింటాళ్లు కలిపి మొత్తం 3,004 క్వింటాళ్లను ఈ ఆగస్టు 13న బహిరంగంగా వేలం వేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్జిల్లా కాగజ్నగర్కు చెందిన ఒక బియ్యం వ్యాపారి కిలో రూ.23.5కు వేలంలో దక్కించుకున్నాడు. ఎంఈవో ఆఫీసుల్లో, స్కూళ్లలోని స్టాకును సొంతం చేసుకున్నాడు. అయితే రూ.70 లక్షలు కట్టాల్సి ఉండగా సగం మాత్రమే కట్టినట్టు సమాచారం. మిగతా పైసల కోసం ఆఫీసర్లు అడిగితే తాను ఎంత బియ్యం తీసుకున్నానో అంతకే పైసలు కట్టానని చెప్పడంతో అవాక్కయ్యారు. విద్యా శాఖ పెద్దాఫీసర్లు ఎంఈవోలను పిలిపించి అడిగితే నిల్వలన్నీ వ్యాపారికి అప్పగించామని, ఎంత తరుగు వచ్చిందో తెలియదని చెప్పారు. వ్యాపారికి రూలింగ్పార్టీ లీడర్ల అండ ఉండటంతో ఏమీ చేయలేకపోయారు. బియ్యానికి పురుగులు పట్టాయని, ఎలుకలు, పందికొక్కులు తిన్నాయని రిపోర్టు తయారు చేసుకొని కలెక్టర్దగ్గరికి వెళ్తే ఆమె సీరియసైనట్టు తెలిసింది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టరేట్కు వెళ్లినా నిరాశే ఎదురైందని సమాచారం. చివరికి కాగజ్నగర్కు చెందిన ప్రజాప్రతినిధిని ఆశ్రయించినట్టు తెలిసింది. విషయం ఎటూ తేలకపోవడంతో విద్యా శాఖ పెద్దాఫీసర్ ఇటీవల ఎంఈవోలకు షోకాజ్ నోటీసులిచ్చారు. దాంతో టీచర్స్యూనియన్ల లీడర్లు ఎంట్రీ ఇచ్చారు. ఎంఈవోలను బాధ్యులను చేయడం సరికాదని, వ్యాపారితోనే డబ్బులు కట్టించాలని ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. తర్వాత ఏం జరిగిందో కానీ మూన్నాలుగు రోజుల్లో మొత్తం పైసలు చెల్లిస్తానని వ్యాపారి ఒప్పుకున్నట్టు తెలిసింది. బియ్యం అప్పగించినప్పుడే కాంటా వేసి రసీదులు తీసుకుంటే సమస్య వచ్చేది కాదని, ఎంఈవోల నిర్లక్ష్యమే వారి మెడకు చుట్టుకుందని అంటున్నారు. ఎలుకలు, పందికొక్కులు వందల క్వింటాళ్ల బియ్యం తినడం నమ్మశక్యంగా లేదని, ఏదో గోల్మాల్ జరిగిందని చెబుతున్నారు.
వందల క్వింటాళ్ల బియ్యం ఎలుకలు, పందికొక్కులు బుక్కినయంట
- దేశం
- November 27, 2021
లేటెస్ట్
- Virat Kohli: 2016లో రెండు సార్లు నా హృదయం ముక్కలైంది: విరాట్ కోహ్లీ ఎమోషనల్
- స్వాతి మలివాల్ దాడి కేసులో వీడియో రిలీజ్ చేసిన ఆప్
- ఎంత ముచ్చటగా ఉన్నారు చందు భార్య, పిల్లలు : బంధువులు, మిత్రుల బావోద్వేగం, కన్నీటి పర్యంతం
- Siddu Jonnalagadda: సక్సెస్ ఇచ్చే కిక్కు.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన స్టార్ బాయ్
- 25 ఏళ్ల క్రితం కంటి చూపు లేకుండా చెత్తకుప్పలో దొరికింది: ఆమె తలరాతని తానే రాసుకుంది
- Ramajogaiah Sastry: ఒక్క రోజు ఓపిక పట్టండి అబ్బా..ఫస్ట్ కోత అయితే..సెకండ్ లేత అంటూ శాస్త్రీ ట్వీట్
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- భూ వివాదం..మల్లారెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధం
- Chandrakanth: నీకు మేము లేమా.. ఎందుకిలా చేసుకున్నావ్.. చంద్రకాంత్ తల్లితండ్రుల ఆవేదన
- తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు విడుదల.. ఫస్ట్ ర్యాంక్ విద్యార్థి ఇతనే..
Most Read News
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- స్వామియే శరణం అయ్యప్ప : 6.5 లక్షల ప్రసాదం డబ్బాలు ఎలా నాశనం చేయాలి..?
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెంకట్రామిరెడ్డిని డిస్ క్వాలిఫై చేయండి.. సీఈఓకు రఘనందన్ రావు ఫిర్యాదు