హైదరాబాద్ నగరంలో కత్తి పట్టుకుని తిరుగుతున్న ఓ వ్యక్తికి కోర్టు ఆరు రోజుల జైలు శిక్ష విధించింది. దాంతో పాటు అతనికి రూ.300 జరిమానా కూడా విధించింది.
భవానీనగర్కు చెందిన షేక్ మహ్మద్ (22)పై హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ సెక్షన్ 70బి, 61ఎ, 61(బి), ఐపీసీ 290 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అక్టోబర్ 15న తాళ్లకట్ట సమీపంలో ఓ బృందం పెట్రోలింగ్ చేస్తుండగా.. ఒక కానిస్టేబుల్ ముఖానికి కప్పుకుని అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని గుర్తించాడు. ఎవరి పైనో దాడి చేయాలనే ఉద్దేశ్యంతో కత్తిని తీసుకెళ్లాడని భవానీనగర్ పోలీస్స్టేషన్ ఎస్హెచ్వో ఎం. రవీందర్ తెలిపారు.
“పోలీస్ కానిస్టేబుల్ను చూడగానే నిందితుడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. కానిస్టేబుల్ నిందితుడిని పట్టుకోగా అతని వద్ద కత్తి దొరికింది. అతను ఆ ప్రాంతంలో తిరుగుతూ అనుమానాస్పదంగా కనిపించాడు. అందుకే అతడిపై కేసు బుక్ చేశాం’’ అని రవీందర్ చెప్పారు.