హైదరాబాద్, వెలుగు: కొవిడ్తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ పై సిటిజన్స్లో ఇంట్రెస్ట్పెరిగింది. ప్రస్తుతం 80 శాతం మంది ఏదో ఒకహెల్త్పాలసీ మస్ట్గా తీసుకుంటున్నారు. ఏదైనా రోగం వచ్చినంక ఇబ్బంది పడేకంటే ముందుగానే పాలసీ చేయించుకుంటే బెటర్అనుకుని ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు. హెల్త్కంపెనీల కాంటాక్ట్నంబర్లను తీసుకొని పాలసీల కోసం కాల్చేస్తున్నారని కంపెనీల ఎగ్జిక్యూటివ్స్ చెబుతున్నారు. కరోనా సోకిన వారు లక్షల్లో బిల్లులు చెల్లించి డిశ్చార్జ్అయిన తర్వాత ఇంటికి వెళ్లి మస్ట్గా హెల్త్ఇన్సూరెన్స్లను తీసుకుంటున్నారు. కొందరు అడ్మిట్అయినప్పుడు పక్క పేషెంట్వద్ద వివరాలు తెలుసుకుని పాలసీలను తీసుకునేవారు ఉంటున్నారు. మొత్తానికి వేలతో అయిపోయే దానికి లక్షలు ఎందుకు ఖర్చు చేసుకోవాలని ఆలోచిస్తు న్నారు. ఫ్యామిలీకి గ్రూప్గా, సీనియర్ సిటిజన్స్ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి వారు పాలసీలు చేస్తున్నారు.
ఆరోగ్యశ్రీపై నమ్మకం లేకనే...
ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్హాస్పిటల్స్లోను ఫ్రీ ట్రీట్ మెంట్పొందవచ్చని ప్రభుత్వం చెబుతున్న మాటలు ఉత్తవేనని జనాలు అంటున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు కింద వర్తించే రోగాలకు కూడా డబ్బులు చెల్లిస్తేనే ఆస్పత్రుల మేనేజ్మెంట్లు ట్రీట్ మెంట్అందిస్తామని చెబుతున్నాయి. చేసేది లేక డబ్బులు కట్టి పేదలు తప్పనిసరిగా ట్రీట్ మెంట్చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అటానమస్ఆస్పత్రి అయిన నిమ్స్లో కూడా డబ్బులు చార్జ్చేస్తున్నారు. ఏ రోగమైనా వెళ్తే ఆరోగ్యశ్రీ వర్తించదని వెంటనే బిల్లు కట్టించుకుంటున్నారు. అడ్మిట్అయ్యేవారు కొద్దిరోజుల తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్కు షిఫ్ట్ అవుతున్నారు. డైలీ నలుగురైదుగురు పేషెంట్లు వేరే హాస్పిటల్స్కు వెళ్తున్నారు. ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోతుండగా ఆరోగ్యశ్రీ కార్డులపై డాక్టర్లు ట్రీట్మెంట్ అందించడంలేదని తెలిసింది. ఇలా ఆరోగ్యశ్రీ కార్డుపై ఎంతో నమ్మకం పెట్టుకొని హాస్పిటల్స్కి వెళ్తున్న వారికి ఫ్రీ ట్రీట్ మెంట్అందకపోతుండగా చేసేదిలేక హెల్త్ఇన్సూరెన్స్పాలసీలు తీసుకుంటున్నారు.
కొవిడ్ తర్వాత పెరిగిన కస్టమర్లు
గతంలో మూడేళ్లలో అయ్యే ఇన్సూరెన్స్ పాలసీలు కరోనా తర్వాత ఒక్క ఏడాదిలోనే డబుల్ అయ్యాయని హెల్త్ఇన్సూరెన్స్కంపెనీల ఎగ్జిక్యూటివ్ లుచెబుతున్నారు. చిన్న కంపెనీ నుంచి పేరొందిన సంస్థల పాలసీలు తీసుకుంటున్నారంటున్నారు . కొందరు కరోనాకు కూడా సపరేట్గా ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు. కొవిడ్ కోసం రూ. వేయి నుంచి రూ. 10 వేల వరకు ప్రత్యేకమైన పాలసీలు కూడా అందుబాటులో ఉన్నాయి. పేరొందిన ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో కరోనాకి ముందు సిటీలో 12 లక్షల మంది కస్టమర్లు ఉండగా, కరోనా తర్వాత 19 లక్షలకు చేరారు. దాదాపు 50 శాతం పాలసీలు పెరిగిపోయాయి.
అడ్మిట్ చేసుకొని పట్టించుకోలే..
మా అన్న బ్రెయిన్ కి సంబంధించిన జబ్బుతో బాధపడుతుండగా నిమ్స్ కి తీసుకొచ్చాం. డాక్టర్లు అడ్మిట్ చేసుకోగా, ఆరోగ్యశ్రీ ఉందని చెబితే వర్తించదని చెప్పారు. మూడు రోజులు దాటినా పెద్దగా పట్టించుకోలేదు. కూకట్ పల్లిలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాం. నిమ్స్తో పాటు మరో ప్రైవేట్ఆస్పత్రిలో ఇప్పటికే 3 లక్షలు ఖర్చు చేశాం. ఆరోగ్యశ్రీ కార్డు ఉందనే భరోసా వెళ్తే పట్టించుకోలేదు. ఇంటికెళ్లాక ప్రవేటుగానైనా హెల్త్కార్డు తీసుకుంటా.
- బి.రాజు,పేషెంట్ బంధువు
జనాల్లో పెరిగిన అవేర్నెస్
హెల్త్ఇన్సూరెన్స్లను చేయించేందుకు జనం ఫుల్ఇంట్రెస్ట్చూపుతున్నారు. అందుబాటులో వివిధ రకాల పాలసీలు ఉన్నాయి. ఎవరికి తగిన పాలసీ వారు చేయించుకుంటున్నారు. కరోనా తరువాత హెల్త్పై పబ్లిక్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆస్పత్రుల్లో అడ్మిట్ అయి లక్షలు ఖర్చు చేసుకుంటున్న వారు పాలసీ చేస్తే వేలల్లోనే అయిపోతుంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం బిజినెస్ కూడా బాగా ఉంది. - మహేందర్రెడ్డి, టెరిటరీ మేనేజర్, హైదరాబాద్ స్టార్హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ
హెల్త్ కార్డుపై ఇంట్రెస్ట్చూపిస్తూ..
ప్రస్తుతం హెల్త్ఇన్సూరెన్స్చేయించుకునేందుకు జనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గతంలో కస్టమర్ల వద్దకు వెళ్లి ఎంత చెప్పినా ఆలోచించి చూస్తామని చెప్పేవారు. ఇప్పుడు వారే ముందుకొచ్చి పాలసీ తీసుకుంటామని కాంటాక్ట్అవుతున్నారు.
- సురేశ్, ఓ హెల్త్ ఇన్సూరెన్స్కంపెనీ జేఎస్ఓ