కరోనా.. ఈ పేరు వింటనే ఇప్పటికీ హడలెత్తిపోతాం. 20వ శతాబ్దపు ప్రజలను 3 ఏళ్ల పాటు పట్టి పీడించిన మహ్మమారి ఈ కరోనా. ప్రపంచ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రాణాలను హరించిన ఈ మహమ్మారి ఇప్పటికి మన మధ్యే ఉంది. అయితే 2019లో చైనా నుంచి ఇది వ్యాప్తి చెందింది. అప్పటి నుంచి ఆ దేశంపై ప్రపంచ దేశాలకు అనేక అనుమానాలు ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికా సైతం దాన్ని కృత్రిమంగా సృష్టించి మానవ జాతిపై చైనా ప్రయోగించిందని అప్పట్లో సంచలన కామెంట్స్ చేసింది. వూహాన్లోని వైరాలజీ ల్యాబ్నే కరోనా వైరస్ని సృష్టించడానికి చైనా ఎంచుకుందని అప్పట్లో ప్రపంచం కోడై కూసింది. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వం తప్పుబట్టింది. అయితే ఆ తప్పు నిజమే అని అమెరికా కు చెందిన ఓ నివేదిక చెప్పడం సంచలనం సృష్టిస్తోంది.
ఆధారాలేవి లేవు..
కొవిడ్19 మహమ్మారి చైనాలోని వూహాన్వైరాలజీ ల్యాబ్లోనే పుట్టిందనడానికి ప్రత్యక్ష ఆధారాలేవీ లేవని అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నివేదిక జూన్23న వెల్లడించింది. ఈ నివేదిక ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కానీ వైరాలజీ ల్యాబ్ నుంచే లీక్ అయి ఉంటుందనే విషయాన్ని నాలుగు పేజీలతో కూడిన ఆ రిపోర్ట్ తోసిపుచ్చలేదు. తాము కరోనా మూలాలను అక్కడే ఉన్నట్లు కనుక్కోలేదని అంతమాత్రాన అక్కడి నుంచి లీక్ కాలేదని మాత్రం చెప్పలేమని ఏజెన్సీ అధికారులు స్పష్టం చేశారు. ఇంకా ఈ అంశంపై పరిశోధనలు జరగాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.