సోషల్మీడియాలో పోస్టులపై నిఘా పెట్టాలి : సీపీ అంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఝా

సోషల్మీడియాలో పోస్టులపై నిఘా పెట్టాలి : సీపీ అంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఝా

గోదావరిఖని, వెలుగు: పదేపదే చోరీలకు పాల్పడడం, నకిలీ విత్తనాల రవాణా, ఇతర నేరాలకు పాల్పడిన వారిపై ‘గ్యాంగ్ ఫైల్స్’ ఓపెన్ చేయాలని రామగుండం సీపీ అంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఝా సూచించారు. శుక్రవారం కమిషనరేట్‌‌‌‌‌‌‌‌లో పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పరిధిలోని డీసీపీలు, ఏసీపీలు, ఎస్​హెచ్‌‌‌‌‌‌‌‌వోలతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు ప్రజలతో సత్సంబంధాలు పెరుగుతాయన్నారు. 

సోషల్​ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. పెద్దపల్లి జోన్ పరిధిలో 34 కేసుల్లో 98 మందిని అరెస్ట్ చేసి రూ.77.63 లక్షల విలువైన 157 కేజీల గంజాయిని సీజ్​ చేశామని, మంచిర్యాల జోన్ పరిధిలో 34 కేసుల్లో 98 మందిని అరెస్ట్ చేసి రూ.16.69 లక్షల విలువైన 34 కిలోల గంజాయిని సీజ్‌‌‌‌‌‌‌‌ చేసినట్టు సీపీ చెప్పారు. కేసుల్లో నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన పోలీసులకు క్యాష్​ అవార్డులు అందజేశారు.