నిజామాబాద్ నగరంలోని అనాథ పిల్లలకు నోట్ బుక్స్ పంపిణీ : సీపీ సాయిచైతన్య

నిజామాబాద్ నగరంలోని అనాథ పిల్లలకు నోట్ బుక్స్ పంపిణీ : సీపీ సాయిచైతన్య

నిజామాబాద్,  వెలుగు:  నగరంలోని బాలసదన్​లోని అనాథ పిల్లలకు గురువారం సీపీ సాయిచైతన్య నోట్​ బుక్స్​, పెన్నులు, ఆపిల్ పండ్లు పంపిణీ చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా బాలసదన్​ను విజిట్ చేసిన ఆయన అక్కుడున్న పిల్లలతో సరదాగా గడిపారు. యోగక్షేమాలు తెలుసుకున్నారు. 

చదువులో ముందుకుసాగాలని తమ పక్షాన సహాయసహకారాలు అందిస్తామని తెలిపారు. అదనపు డీసీపీ బస్వారెడ్డి, 4 టౌన్ ఎస్​హెచ్​వో సతీష్​కుమార్​, ఎస్సై హరిబాబు, బాలసదన్ సూపరింటెండెంట్లు వినోద, శోభారాణి పాల్గొన్నారు.