చెప్పులు నెత్తిన పెట్టుకొని..కేంద్రంపై నారాయణ విమర్శలు

చెప్పులు నెత్తిన పెట్టుకొని..కేంద్రంపై నారాయణ విమర్శలు

కేంద్రం, ఏపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. చెప్పులపై జీఎస్టీ వేయడం ఏంటని ప్రశ్నించారు. తిరుపతిలో చెప్పులను నెత్తిన పెట్టుకొని నిరసన తెలిపారు. జీఎస్టీతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఏపీలో పోలీసు, రౌడీ వ్యవస్థ కలిసిపోయాయని ఆరోపించారు నారాయణ. కొత్త ఏడాదిలో సీపీఐ,సీపీఎం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. జనవరి 26 నుంచి సీపీఐ జాతీయ సమావేశాలు నిర్వహిస్తామన్నారు నారాయణ.