
- సింగరేణిలో రాజకీయ జోక్యంపై పోరాడకుండా కొందరు పైరవీలు
గోదావరిఖని, వెలుగు : సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీని విమర్శించడమే కొన్ని యూనియన్లు పనిగా పెట్టుకున్నాయని ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్వర్కర్స్యూనియన్స్టేట్ప్రెసిడెంట్వి.సీతారామయ్య మండిపడ్డారు. సింగరేణిలో పెరిగిన రాజకీయ జోక్యానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయకుండా కొందరు నేతలు పైరవీలు చేస్తున్నారని ఆరోపించారు.
సోమవారం గోదావరిఖనిలోని యూనియన్ఆఫీస్లో జరిగిన మీటింగ్లో యూనియన్జనరల్సెక్రటరీ కె.రాజ్ కుమార్ తో కలిసి ఆయన మాట్లాడారు. ఏఐటీయూసీ గెలిచిన తర్వాత కార్మికుల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో సంస్థయాజమాన్యం దృష్టికి తీసికెళ్లిందని గుర్తు చేశారు. స్ట్రక్చర్ మీటింగ్ లో మాట్లాడి పరిష్కరించిందని, అందులో కొన్నింటికి సర్క్యులర్ లు కూడా జారీ అయ్యాయని తెలిపారు.
సంస్థకు వచ్చే లాభాల్లో 35 శాతం వాటా ఇవ్వాలని యాజమాన్యానికి లేఖ రాశామని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపిందని చెప్పారు. సింగరేణిలో కొత్త గనుల ఏర్పాటు, సొంతింటి స్కీమ్, మారుపేర్ల సమస్యల పరిష్కారం సర్కార్ పరిధిలోనే ఉందని పేర్కొన్నారు. మీటింగ్లో లీడర్లు మడ్డి ఎల్లాగౌడ్, కనకరాజు, సయ్యద్ సోహెల్, తాల్లపెల్లి మల్లయ్య, ప్రీతం, రామస్వామి, బుర్ర భాస్కర్, తొడుపునూరి రమేశ్ కుమార్ పాల్గొన్నారు.