
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డలో గుప్త నిధులు బయటపడ్డాయి. రెండు నెలల క్రితం దుర్గయ్య అనే రైతు మామిడి చెట్లు నాటేందుకు గుంతలు తీస్తుండగా … పురాతన నాణాలు బయటపడ్డాయి. అయితే ఈ విషయం ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టాడు.
అయితే కూలీలకు – రైతు దుర్గయ్యకు మద్య వివాదం జరగడంతో గుప్త నిధుల విషయం పోలీసులకు తెలిసింది. గ్రామానికి చేరుకున్న పోలీసులు… 51 పురాతన నాణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి కాకతీయుల కాలం నాటి బంగారం, రాగి కలిసిన నాణాలుగా గుర్తించారు.