చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతోన్న ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. చెన్నై ఆల్ రౌండర్ జడేజా 3 వికెట్లతో తిప్పేయడంతో సన్ రైజర్స్ తక్కువ స్కోరుకే పరిమితమయ్యింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి కేవలం 134 పరుగులు మాత్రమే చేసి.. చెన్నైకి స్వల్ప టార్గెట్ ను నిర్దేశించింది.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ కు ఆది నుంచే దురదృష్టం వెంటాడింది. ఓపెనర్ హర్రీ బ్రూక్ 18, అభిషేక్ శర్మ 34 పరుగులకే పెవిలియన్ చేరారు. తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి 21 మినహా మిగతా వారెవరూ పెద్దగా రాణించ లేదు. దీంతో సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో జడేజా 3, ఆకాష్ సింగ్, మహీష్ తీక్షాన, మతీషా పత్రినా తలో ఒక వికెట్ తీశారు.