అయోధ్యలో కొనసాగుతున్న ఆంక్షలు

అయోధ్యలో కొనసాగుతున్న ఆంక్షలు

అయోధ్యలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. ఆంక్షల కారణంగా టూరిస్టులు ఇబ్బందులు పడుతున్నారు. రామజన్మ భూమి పరిసర ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. బారికేడ్లు, ముల్ల కంచలతో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు సరయూ నదిలో భక్తుల సందడి కనిపిస్తోంది. నదిలో పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలు చేస్తున్నారు. సుప్రీం తీర్పుపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.