IND vs PAK: పెవియన్‌కు క్యూ కట్టిన పాక్ బ్యాటర్లు... ఏడు వికెట్లు డౌన్

IND vs PAK: పెవియన్‌కు క్యూ కట్టిన పాక్ బ్యాటర్లు... ఏడు వికెట్లు డౌన్

భారత్‌తో జరిగే మ్యాచ్‌లో తమదే గెలుపంటూ గంభీరాలు పలికిన పాకిస్తాన్ ఆటగాళ్లు సమయం వచ్చేసరికి తడబడ్డారు. భారత బౌలర్ల జోరుకు క్రీజులో నిలబడలేక పెవియన్‌కు క్యూ కట్టారు. 29.4 ఓవర్లలో 155/2 స్కోర్‌తో పటిష్టంగా ఉన్న పాక్.. 35.2 ఓవర్లు ముగిసేసరికి.. కేవలం 34 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోయింది.

సిరాజ్ దెబ్బ

73 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పాక్‌ను బాబర్‌ ఆజమ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌ జోడి ఆదుకున్నారు. నిలకడగా ఆడుతూ మూడో వికెట్‌కు 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే జట్టు స్కోర్‌ 155 పరుగుల వద్ద బాబర్‌ ఆజమ్‌ ఔట్‌ కాగానే మిగతా బ్యాటర్‌లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో 172 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.