- కాల్ సెంటర్ల నుంచి సైబర్క్రైమ్ ఆపరేషన్
- టెలీ కాలర్స్తో ఫోన్లు చేయిస్తూ ఫ్రాడ్
- ఢిల్లీ, మధ్యప్రదేశ్లో సెంటర్లను ట్రేస్ చేసిన తెలంగాణ పోలీసులు
- ఫోన్ కాల్స్తో అప్రమత్తంగా ఉండాలని సూచన
హైదరాబాద్, వెలుగు: ‘‘హలో సార్.. మేం బ్యాంకు నుంచి మాట్లాడుతున్నం.. అంటూ క్రెడిట్కార్డు, పర్సనల్ లోన్, హోమ్లోన్, ఇన్సూరెన్స్ ల పేరుతో చేసే ఫోన్కాల్స్అన్ని నిజమైనవి కాకపోవచ్చు. మీతో మాట్లాడుతున్న టెలీ కాలర్స్సైబర్నేరగాళ్లు ఆపరేట్చేస్తున్న కాల్సెంటర్ల నుంచి ఫోన్చేస్తుండొచ్చు. అలర్ట్గా ఉండాల్సిందే. ఎందుకంటే ఇటీవల కాలంలో ఈ తరహా మోసాలను తెలంగాణ పోలీసులు ట్రేస్చేశారు. ఐటీ కంపెనీల తరహా కాల్సెంటర్స్ ఏర్పాటు చేస్తున్న సైబర్నేరగాళ్లు కన్సల్టెన్సీల ద్వారా నిరుద్యోగ యువతను తక్కువ జీతాలకు టెలీకాలర్స్గా రిక్రూట్చేసుకుంటూ వాళ్లతో ఫ్రాడ్చేయిస్తున్నారు. బ్యాంక్కస్టమర్ల డేటాను ఏజెన్సీల ద్వారా కొంటున్న ఈ దుండగులు.. ఆ వివరాలతో టెలీకాలర్స్ద్వారా బ్యాంక్నుంచి మాట్లాడుతున్నాం.. అంటూ ఫోన్లు చేయించి డబ్బు కాజేస్తున్నారు. ఇలాంటి తరహా కాల్సెంటర్లు ఢిల్లీ, కోల్కతా, రాజస్థాన్, యూపీతో పాటు దేశవ్యాప్తంగా సుమారు15 చోట్ల పని చేస్తున్నట్లు తెలంగాణ సైబర్క్రైమ్పోలీసులు గుర్తించారు.
ఢిల్లీలో రెండు కాల్ సెంటర్స్పై రైడ్స్
డబ్బు పోగొట్టుకున్నామంటూ.. పోలీసులను ఆశ్రయించిన బాధితుల వద్ద నుంచి ఫోన్ నంబర్స్ తీసుకున్న సైబర్క్రైమ్పోలీసులు వాటిని ట్రేస్చేశారు. ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న రెండు కాల్సెంటర్స్పై సోమ, మంగళవారం రెండు రోజులు రైడ్స్చేశారు. 24 మందిని అదుపులోకి తీసుకొని, ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్కు తీసుకొచ్చారు. కాగా ఈ రైడ్స్లో పోలీసులు కీలక అంశాలు గుర్తించారు. కాల్సెంటర్స్ నిర్వహణపై ఆధారాలు సేకరించారు. గత నెల17న కూడా ఇలాంటి కేసునే తెలంగాణ పోలీసులు ట్రేస్చేశారు. ఆర్బీఎల్ క్రెడిట్కార్డు హోల్డర్లను మోసం చేస్తున్న16 మంది సభ్యుల ఢిల్లీ గ్యాంగ్ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని ఫేక్ కాల్సెంటర్స్ పై దాడులు చేసి 1865 సిమ్కార్డులను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ కస్టమర్ల డేటా సంపాదించి ఫేక్కాల్స్చేస్తూ.. బల్క్మేసేజ్ లు, లింక్లు పంపుతూ అకౌంట్స్లో డబ్బులు కాజేస్తున్నట్లు గుర్తించారు.
టెలీ కాలర్స్కు అనుమానం రాకుండా
టెలీ కాలర్స్గా పనిచేస్తున్న ఉద్యోగులకు సైబర్నేరగాళ్లు ఎలాంటి అనుమానం రానివ్వడం లేదు. బ్యాంకుల క్రెడిట్కార్డులు, లోన్లు, బీమా తదితర థర్డ్ పార్టీ ఏజెన్సీలుగా నమ్మించి టెలీ కాలర్స్తో కస్టమర్లకు కాల్ చేయిస్తున్నారు. కస్టమర్ల బ్యాంక్అకౌంట్పూర్తి వివరాలు కొట్టేసి.. ఖాతాలో ఉన్న డబ్బును వారి ఈ వ్యాలెట్లోకి డైవర్ట్ చేసుకుంటున్నారు. ఇలాంటి నేరాల్లో సైబర్ క్రైమ్ పోలీసులు చేస్తున్న రైడ్స్లో టెలీకాలర్స్మాత్రమే చిక్కుతున్నారు. సైబర్ క్రిమినల్స్ నిర్వహిస్తున్న కాల్ సెంటర్స్లో తాము పనిచేస్తున్న విషయం తెలుసుకుని వాళ్లు భయాందోళనకు గురవుతున్నారు.