నర్సంపేట, వెలుగు: నర్సంపేట పట్టణంలోని బాయ్స్హైస్కూల్లో శాంతిసేన సేవా రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం డివిజన్స్థాయి పాడిపశువుల అందాల పోటీలు నిర్వహించారు. వివిధ మండలాలకు చెందిన రైతులు తమ ఎడ్లు, పాడిగేదెలు, లేగదూడెలు, పొట్టేళ్లు, కోళ్లు, కుందేళ్లు, కుక్కలను ముస్తాబు చేసుకుని పోటీలకు తీసుకొచ్చారు. విజేతలకు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ షీల్డ్లు, నగదు బహుమతులను అందజేశారు.
కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్లు పెండెం రామానంద్, సొంటిరెడ్డి రంజిత్రెడ్డి, శాంతిసేన రైతు సేవా సంఘం అధ్యక్షుడు చిలువేరు కుమారస్వామి, గౌరవాధ్యక్షుడు ఎర్ర జగన్మోహన్రెడ్డి, చిలువేరు కుమారస్వామి, మెండు అశోక్, చిలువేరు కొమ్మాలు, బుర్ర మోహన్రెడ్డి, తోట అశోక్, చింతల సాంబరెడ్డి, రేమిడి శ్రీనివాస్రెడ్డి, ఈగ సత్యనారాయణ, ఒరగంటి ప్రభాకర్, యాకూబ్రెడ్డి తదితరులున్నారు. పాడి పశువుల అందాల పోటీలను తిలకించేందుకు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం నర్సంపేట టౌన్లో ఎంపీ, ఎమ్మెల్యే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
