
శివ్వంపేట, వెలుగు: బిజిలిపూర్ లో దళితులపై దాడి చేసినవారిని అరెస్ట్ చేయాలని డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్, బాధితుడు నవీన్ కోరారు. శుక్రవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను హైదరాబాద్లో కలిసి వినతి పత్రం అందజేశారు.
పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చైర్మన్ తూప్రాన్ డీఎస్పీ నరేందర్ కు ఫోన్ చేసి, నిందితులను అరెస్ట్ చేయాలని ఆదేశించారని శంకర్ తెలిపారు. నాయకులు చంద్రం, లక్ష్మణ్ ఉన్నారు.