హైదరాబాద్, వెలుగు: రాబోయే మూడేళ్లలోపు పబ్లిక్ ఇష్యూకు వెళ్తామని హెచ్ఆర్ టెక్ కంపెనీ డార్విన్ బాక్స్ కో–ఫౌండర్ చెన్నమనేని రోహిత్ వెల్లడించారు. హైదరాబాద్లో సోమవారం తమ కొత్త ఆఫీసును ప్రారంభించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 2025 నాటికి లాభాల్లోకి వస్తామని అన్నారు. ఇండియా ఆపరేషన్స్వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయని ప్రకటించారు. హైదరాబాద్కు చెందిన డార్విన్ బాక్స్ ఈ ఏడాది జనవరిలో బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ సాధించి ‘యూనికార్న్’గా ఎదిగింది. ఈ సంస్థ ప్రమోటర్ల దగ్గర 30 శాతం వాటా ఉంది. మిగతా వాటా టీసీవీ, సేల్స్ఫోర్స్ వెంచర్స్, సికోవియా, లైట్స్పీడ్, ఎండియా పార్ట్నర్స్ దగ్గర ఉంది.
‘‘హెచ్ఆర్ టెక్ సెగ్మెంట్లో ఇండియాలోనే మాది మూడో అతిపెద్ద కంపెనీ. హైదరాబాద్ ఆఫీసులో ప్రస్తుతం మాకు 700 మంది ఉద్యోగులు ఉన్నారు. ఏడాదిలోపే వీరి సంఖ్యను వెయ్యికి పెంచుతాం. ఈ ఆఫీసు మాకు గ్లోబల్ హెడ్క్వార్టర్గా పనిచేస్తుంది. మా మార్కెట్ షేర్25 శాతం ఉంటుంది. ఐటీ, ఐటీఈఎస్, బీఎఫ్ఎస్ఐ, మాన్యుఫాక్చరింగ్ సెక్టార్లలో మాకు 700 మంది క్లయింట్లు ఉన్నారు. రాబోయే రెండేళ్లలో మరో రూ.400 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్లు సేకరించే అవకాశం ఉంది. ఇండియాతోపాటు సింగపూర్, థాయిలాండ్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, మలేషియా, గల్ఫ్ దేశాల్లో సేవలు అందిస్తున్నాం. ఇటీవలే అమెరికాలో అడుగుపెట్టాం. త్వరలో జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మార్కెట్లకు వెళ్తాం” అని ఆయన వివరించారు.
త్వరలో మరిన్ని మార్కెట్లకు వెళ్తాం: స్కూటర్ డైరెక్టర్ పునీత్ చంద్ర
డార్విన్ బాక్స్ ఆఫీసు ప్రారంభోత్సవం సందర్భంగా మేనేజ్డ్ ఆఫీస్ స్పేస్ ఆపరేటర్ స్కూటర్ డైరెక్టర్ పునీత్ చంద్ర మాట్లాడుతూ తాము త్వరలో ముంబై, పుణే, చెన్నై మార్కెట్లకూ విస్తరిస్తామని చెప్పారు. హైదరాబాద్లోని స్కూటర్ ఆఫీసులో డార్విన్ బాక్స్కు 75 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ఇచ్చామని చెప్పారు. హైదరాబాద్లో ఐదు లక్షల మేనేజ్డ్ ఆఫీసు స్పేస్ను నిర్వహిస్తున్నామని, దేశంలో పది లక్షల చదరపు అడుగుల స్పేస్ను నిర్వహిస్తున్నామని చెప్పారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో దీనిని 2.5 లక్షల చదరపు అడుగులకు పెంచాలనే టార్గెట్తో పనిచేస్తున్నామని చెప్పారు.
హైదరాబాద్తోపాటు ఢిల్లీ, గుర్గావ్, జైపూర్ వంటి నగరాల్లో తమకు 11 సెంటర్లు ఉన్నాయని వివరించారు. క్లారానెట్, గ్రాంట్ థార్న్టన్, ఫ్యూచర్ ఫస్ట్, క్రెడిట్సేఫ్ వంటివి తమ క్లయింట్లను వివరించారు. ‘‘గత క్వార్టర్ రూ.75 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టాం. రాబోయే ఆర్థిక సంవత్సరంలో మరో రూ.100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తాం. రాబోయే నాలుగేళ్లలో ఐపీఓకు వెళ్లాలనే ఆలోచన కూడా ఉంది. ఈ సెగ్మెంట్లో దాదాపు ఆరేడు సంస్థలు ఉన్నాయి. అమెరికా వంటి దేశాల్లో ఆర్థికమాంద్యం ఛాయలు కనిపిస్తున్నా ఇండియాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. నిజానికి మనకు లాభం కూడా! ఎందుకంటే ఖర్చులను తగ్గించుకోవడానికి పెద్ద కంపెనీలన్నీ ఔట్సోర్సింగ్వైపు చూస్తాయి” అని ఆయన వివరించారు.