కర్రీ పఫ్ లో చచ్చిన పాము..మహబూబ్ నగర్ జిల్లా ..జడ్చర్లలో కలకలం

కర్రీ పఫ్ లో చచ్చిన పాము..మహబూబ్ నగర్ జిల్లా ..జడ్చర్లలో కలకలం

జడ్చర్ల, వెలుగు: కర్రీ పఫ్​లో చచ్చిన పాము కనిపించడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల పట్టణం జౌకీనగర్​కు చెందిన అలుగొండ శ్రీశైల తన పిల్లల కోసం మంగళవారం మధ్యాహ్నం  పట్టణంలోని శ్రీలక్ష్మీ బెంగళూరు బేకరీ అండ్​ స్వీట్స్​ షాపులో రెండు కర్రీ పఫ్​లు​కొనుగోలు చేసింది. 

సాయంత్రం 5 గంటల సమయంలో బడి నుంచి పిల్లలు ఇంటికి రావడంతో వారికి ఒక కర్రీ పఫ్​ ఇచ్చి, మరొకటి తాను తింటుండగా అందులో చనిపోయిన పాము పిల్ల కనిపిందింది.  శ్రీశైల ఆందోళనతో బేకరీకి వచ్చి షాపు యాజమానితో గొడవకు దిగింది. అనంతరం స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. సీఐ కమలాకర్​ ఈ విషయంపై ఫుడ్​ ఇన్స్​పెక్టర్​కు ఫోన్​లో సమాచారం అందజేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.