బస్టో అర్సిజియో (ఇటలీ) : ఇండియా బాక్సర్లు దీపక్ భోరియా, నరేందర్ వరల్డ్ బాక్సింగ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో నిరాశ పరిచారు. తొలి రౌండ్లోనే ఓడి ఇంటిదారి పట్టారు. ఆదివారం జరిగిన మెన్స్ 51 కేజీ బౌట్లో దీపక్ 2–3తో అజర్బైజాన్ బాక్సర్ హుసెనొవ్ నిజత్ చేతిలో పోరాడి ఓడిపోయాడు. +92 కేజీ కేటగిరీలో నరేందర్ 0–5తో నెల్వీ తియఫక్ (జర్మనీ) చేతిలో చిత్తయ్యాడు.