రికార్డ్.. రికార్డ్.. అయోధ్యలో 22లక్షల 23వేల దీపాలతో ఘనంగా దీపోత్సవం..

రికార్డ్.. రికార్డ్.. అయోధ్యలో 22లక్షల 23వేల దీపాలతో ఘనంగా దీపోత్సవం..
  • సరయూ నది ఒడ్డున 22లక్షల 23వేల దీపాలతో దీపోత్సవం
  • గంగానదికి హారతి ఇచ్చిన సీఎం యోగి ఆదిత్య నాథ్

దీపావళి సందర్భంగా అయోధ్య లోని సరయూ నది ఒడ్డున దీపోత్సవ కార్యక్రమం వైభవంగా సాగింది. సరయూ నది ఘాట్ వద్ద సీఎం యోగి గంగానదికి హారతి ఇచ్చారు. లక్షలాది దీపాలతో ఘాట్ దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, గవర్నర్, మంత్రులు, సాధువు పాల్గొన్నారు. దీపోత్సవం సందర్భంగా సరయూ నది ఒడ్డున ఉన్న అన్ని ఘాట్ లలో 22లక్షల 23వేల దీపాలు వెలిగించి గతంలో ఉన్న లక్ష దీపాల రికార్డును బద్దలు కొట్టారు. సరయూ నదిపై లేజర్ షో నిర్వహించారు. బాణసంచాతో దీపోత్సవం ఘనంగా నిర్వహించారు.