Delhi airport: ఢిల్లీలో టెన్షన్..టెన్షన్.. ఎయిర్ పోర్టుకు, స్కూళ్లకు బాంబు బెదిరింపులు

Delhi airport: ఢిల్లీలో టెన్షన్..టెన్షన్.. ఎయిర్ పోర్టుకు, స్కూళ్లకు బాంబు బెదిరింపులు

ఢిల్లీలో టెన్షన్​.. టెన్షన్​.. మరోసారి బాంబు బెదిరింపులతో ఢిల్లీ ఉలిక్కిపడింది.. ఆదివారం (సెప్టెంబర్ 28) మధ్యాహ్నం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు పెట్టామంటూ పోలిసులకు మెయిల్స్​ వచ్చాయి. ఎయిర్ పోర్టుతోపాటు రెండు స్కూళ్లు, పలు సంస్థలలో కూడా బాంబులు పెట్టాం.. పేల్చివేస్తామంటూ దుండగులు మెయిల్స్​ పంపించారు. దీంతో ఢిల్లీ పోలీసులు అలెర్ట్​ అయ్యారు. ఎయిర్​ పోర్టులో తనిఖీ చేపట్టారు. భారీ భద్రత ఏర్పాట్లు  చేశారు. మరోవైపు బాంబు బెదిరింపులు వచ్చిన స్కూళ్లలో కూడా తనిఖీలు చేపట్టారు. 

ద్వారకలోని సీఆర్​పీఎఫ్​ పబ్లిక్ స్కూల్, కుతుబ్ మినార్ సమీపంలోని సర్వోదయ విద్యాలయానికి బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయని అయితే తనిఖీలు చేపట్టిన తరువాత ఈ బెదిరింపులు ఫేక్​ అని తేల్చారు పోలీసులు. 

►ALSO READ | తొక్కిసలాట ఘటనపై విజయ్ TVK పార్టీ సంచలన నిర్ణయం

బాంబు బెదిరింపులతో రంగంలోకి దిగిన పోలీసులు, ఫైర్​ సిబ్బంది, బాంబు  స్క్వాడ్స్ గ్రూప్​లు ఎయిర్​పోర్టు, స్కూళ్లలో  తనిఖీలు నిర్వహించి  ఎటువంటి పేలుడు పదార్థాలు  కనిపించడం లేదని ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది అధికారులు  తెలిపారు.