
I.N.D.I.A పేరును ఉపయోగించడాన్ని నిషేధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. కేంద్రం, ఎన్నికల సంఘం (EC), ప్రతిపక్ష పార్టీలకు నోటీసులు జారీ చేస్తూ షాక్ ఇచ్చింది.
I.N.D.I.A అనే సంక్షిప్త పదాన్ని ఉపయోగించడాన్ని నిషేధించేలా ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు దిశానిర్దేశం చేయాలని కోరుతూ దాఖలైన పిల్పై ఢిల్లీ హైకోర్టు కేంద్రం, ఎన్నికల సంఘం, అనేక ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు నోటీసులు జారీ చేసింది. అనేక రాజకీయ పార్టీలు తమ కూటమికి చిహ్నంగా జాతీయ జెండాను ఉపయోగించడం అమాయక పౌరుల నుంచి సానుభూతి పొందడం, వారి నుంచి ఓట్లను పొందేందుకు ఇదొక వ్యూహాత్మక చర్య అని న్యాయవాది వైభవ్ సింగ్ ఆరోపించారు.
ప్రతిపక్ష పార్టీలు రాజకీయ ద్వేషానికి, హింసకు దారితీసేందుకు ఈ పదాన్ని ఒక సాధనంగా ఉపయోగిస్తున్నాయని వైభవ్ సింగ్ అన్నారు. రాజకీయ పార్టీలు దురుద్దేశంతో సంక్షిప్త పదాన్ని ఉపయోగిస్తున్నాయని, ఇది దేశం సద్భావనను తగ్గించడానికి ఒక కారకంగా మాత్రమే పని చేస్తుందని, ఇండియా అనే పదాన్ని ఇండియన్ గా, అంతర్జాతీయ మీడియా అనే సంక్షిప్త రూపాన్ని ఉపయోగిస్తున్నారని, కానీ ఇలా ఉపయోగించదని కూడా విజ్ఞప్తి చేశారు. ఇది ప్రజల్లో గందరగోళ భావనను సృష్టిస్తుందని తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ కూటమి ఓడిపోయితే అప్పుడు ఇండియా మొత్తం ఓడిపోయిందనే భావన వస్తుందని అంచనా వేశారు.
ఇక ఈ పిటిషన్లో భారత జాతీయ కాంగ్రెస్, TMC, RLD, JDU, సమాజ్వాదీ పార్టీ, DMK, ఆమ్ ఆద్మీ పార్టీ, JMM, NCP, శివసేన (UBT), RJD, అప్నాదళ్ (కామెరవాడి), PDP, JKNC, CPI, CPI(M), MDMK, కొంగనాడు మక్కల్ దేశియా కట్చి (KMDK), విడుతలై చిరుతైగల్ కట్చి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) లిబరేషన్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (మణి), మనితానేయ మక్కల్ కట్చి (MMK) పేర్లను ప్రస్తావించారు.
Delhi High Court issues notice to the Centre, Election Commission and several opposition political parties on a PIL seeking direction to opposition political parties to prohibit the use of the acronym I.N.D.I.A. pic.twitter.com/VmtAWhmfsS
— ANI (@ANI) August 4, 2023