న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ డిప్యూటీ సీఎం, నటు డు పవన్ కల్యాణ్ కొడుకు అకీరా నందన్కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. అతని అనుమతి లేకుండా ఎటువంటి కంటెంట్ ను ప్రసారం చేయొద్దని తెలిపింది. వ్యక్తిత్వ హక్కుల రక్షణకు సంబంధించి అకీరా దాఖలు చేసిన పిటిషన్ పై ఈ కీలక ఆదేశాలు ఇచ్చింది. తన అనుమతి లేకుండా డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి ‘ఏఐ లవ్ స్టోరీ’ సినిమాని రూపొందించారని .. ఇందులో తన ముఖం, స్వరాన్ని మార్ఫింగ్ చేశారని అకీరా నందన్ కోర్టును ఆశ్రయించారు.
యూట్యూబ్లో అప్ లోడ్ చేసిన ఈ చిత్రానికి11 లక్షలకుపైగా వ్యూస్, ఇంగ్లిష్ వెర్షన్ కు 24వేలకుపైగా వ్యూస్ వచ్చాయని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ సినిమాను నిషేధించాలని కోరారు. ఈ పిటిషన్ ను మంగళవారం జస్టిస్ తుషార్ రావు నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఆయన అనుమతి లేకుండా తీసిన ‘ఏఐ లవ్ స్టోరీ’ సినిమాతో సహా డీప్ ఫేక్ కంటెంట్పై నిషేధం విధించింది. అకీరాకు సంబంధించి సోషల్ మీడియాలో షేర్ చేసిన కంటెంట్లను తొలగించాలని ఆదేశించింది.
