చెల్లి మీద అసూయతో సొంత ఇంట్లోనే అక్క దొంగతనం

చెల్లి మీద అసూయతో సొంత ఇంట్లోనే అక్క దొంగతనం

దేశ రాజధాని ఢిల్లీలో విచిత్రమైన దొంగతనం జరిగింది.  ఓ కుమార్తె తన తల్లి ఇంట్లో దొంగతనానికి పాల్పడింది.  సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఈ విషయం బయటపడింది. వివరాల్లోకి వెళ్తే.. 2024 జనవరి 30 వ తేదీన  ఉత్తమ్ నగర్‌లోని సేవక్ పార్క్‌లో నివసిస్తున్న కమలేష్ అనే మహిళ తన ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది.  లక్ష రూపాయలతో పాటు విలువైన బంగారం, వెండి నగలు చోరీకి గురయ్యాయని ఫిర్యాదులో వెల్లడించింది.  తన చిన్న కూతురు పెళ్లి కోసం వీటిని సమకూర్చినట్లుగా తెలిపింది.  

కమలేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.  బయట వ్యక్తులు ఇంట్లోకి వచ్చి దొంగతనం చేసినట్లుగా పోలీసులు నిర్థారణకు వచ్చారు. దీంతో సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా..  ఓ మహిళ బుర్ఖా ధరించి అనుమానాస్పదంగా ఇంట్లోకి ప్రవేశించినట్లు గుర్తించారు.  ఆమె ఎవరా అని ఆరా తీయగా బాధితురాలి పెద్ద కుమార్తె శ్వేత(31) అని తేలింది.  తన చెల్లలిపై అసూయతోనే ఈ దొంగతనానికి పాల్పడినట్లుగా విచారణలో వెల్లడించింది.  దీనికి తోడు అప్పులు కూడా పెరగడంతో సొంత ఇంటిలోనే చోరీకి పాల్పడినట్లుగా శ్వేత ఒప్పుకుంది. 

జనవరి 30న శ్వేత తల్లి కమలేష్‌ ఇంటికి తాళం వేసి కురగాయాల కోసం మార్కెట్ కు వెళ్లింది. ఈ క్రమంలో శ్వేత బుర్ఖా వేసుకోని తన దగ్గరున్న డూప్లికేట్‌ తాళంతో ఓపెన్ చేసి  తల్లి గదిలోని నగలు, నగదు చోరీ చేసింది. అనంతరం వాటిని ఓ దుకాణంలో విక్రయించిందని పోలీసులు తెలిపారు.  నగలను స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించారు.