న్యూఢిల్లీ: అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ ఆడిటర్లయిన డెలాయిట్ తమ తాజా రిపోర్టులో ముగ్గురు పార్టీలతో జరిపిన ట్రాన్సాక్షన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. హిండెన్బర్గ్ రిపోర్టులో ఉదహరించిన ఒక కాంట్రాక్టర్ ట్రాన్సాక్షన్ కూడా వాటిలో ఉంది. పై ముగ్గురు పార్టీలు తమకు అన్ రిలేటెడ్ అని అదానీ గ్రూప్ చెప్పిందని, తాను స్వతంత్రంగా అది నిజమో–కాదో నిర్ధారించలేదని డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ ఎల్ఎల్పీ (ఆడిట్ ఫర్మ్) పేర్కొంది.
రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ల విషయంలో అదానీ గ్రూప్ ట్రాన్స్పరెన్సీ పాటించడం లేదనేది హిండెన్బర్గ్ ఆరోపణలలో ఒకటి. హిండెన్బర్గ్ ఆరోపణలపై సెబీ దర్యాప్తు జరుగుతున్నందున, మరేవిధమైన ఎగ్జామినేషన్ అవసరం లేదని అదానీ గ్రూప్ అభిప్రాయపడినట్లు కూడా ఈ ఆడిట్ ఫర్మ్ తెలిపింది. సెబీ దర్యాప్తు పూర్తి కాకపోవడంతోపాటు, ఇతర ఎగ్జామినేషన్స్ ఏవీ లేకపోవడంతో అదానీ గ్రూప్ జరిపిన ట్రాన్సాక్షన్లన్నీ రూల్స్ ప్రకారమే జరిగాయని తేల్చి చెప్పలేమని వెల్లడించింది.