భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్లే రైళ్లను గతంలో రద్దు చేశారని, వాటిని పునరుద్ధరించాలని సౌత్ సెంట్రల్ రైల్వే డీఆర్యూసీసీ మెంబర్ వై.శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ రైల్వే సంచలన్ భవన్లో మంగళవారం జరిగిన డీఆర్ యూసీసీ మెంబర్స్ మీటింగ్లో జిల్లాలోని రైల్వే అంశాలను ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లారు.
సౌత్ సెంట్రల్ రైల్వే డివిజనల్ మేనేజర్ డాక్టర్ ఆర్.గోపాల కృష్ణన్కు వినతిపత్రం అందజేశారు. కొల్హాపూర్–బెల్గావి ఎక్స్ప్రెస్, మణుగూరు–డోర్నకల్ ప్యాసింజర్, మణుగూరు–కాజీపేట ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని కోరారు. మణుగూరు నుంచి తిరుపతికి, మణుగూరు నుంచి షిర్డీకి ట్రైన్లను నడపాలన్నారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్ పనులు స్పీడప్ చేయాలని, గొల్లగూడెం రోడ్డు విస్తరణ పనులకు సహకరించాలని కోరారు.

