న్యూఢిల్లీ: డీమార్ట్ స్టోర్లను ఆపరేట్ చేస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్కు ఈ ఏడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్ (క్యూ1) లో రూ.658.71 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) వచ్చింది. క్లాత్స్, జనరల్ మర్చండైజ్ సేల్స్ తగ్గడంతో ప్రాఫిట్స్ పెద్దగా పెరగలేదని వెల్లడించింది. కాగా, కిందటేడాది జూన్ క్వార్టర్లో అవెన్యూ సూపర్మార్ట్స్కు 642.89 కోట్ల ప్రాఫిట్ వచ్చింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన రెవెన్యూ రూ.11,865.44 కోట్లుగా రికార్డయ్యింది. కిందటేడాది జూన్ క్వార్టర్లో వచ్చిన రూ.10,038.07 కోట్లతో పోలిస్తే 18.20 శాతం పెరిగింది. కంపెనీ మొత్తం ఖర్చులు 20 శాతం పెరిగి రూ.11,006.92 కోట్లకు చేరుకున్నాయి. కిందటేడాది జూన్ క్వార్టర్తో పోలిస్తే ఈ ఏడాది క్యూ1 లో గ్రాస్ మార్జిన్స్ తగ్గాయి.
అప్పారల్, జనరల్ మర్చండైజ్ సెగ్మెంట్లో సేల్స్ తగ్గడమే ఇందుకు కారణం. జనరల్ మర్చండైజ్ కేటగిరీ రికవరీ అవుతోంది. త్వరలో కరోనా ముందు స్థాయిలకు చేరుకుంటుంది’ అని అవెన్యూ సూపర్మార్ట్స్ సీఈఓ నెవెల్లీ నొరొన్హో అన్నారు. ఈ ఏడాది జూన్ క్వార్టర్లో మూడు కొత్త డీమార్ట్ స్టోర్లను కంపెనీ ఓపెన్ చేసింది. దీంతో మొత్తం డీమార్ట్ స్టోర్ల సంఖ్య 327 కు పెరిగింది. రిటైల్ బిజినెస్ ఏరియా 1.35 కోట్ల చదరపు అడుగులకు చేరుకుంది. మహారాష్ట్ర, గుజరాత్, దామన్, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఎన్సీఆర్, ఛత్తీస్గడ్, పంజాబ్ రాష్ట్రాల్లో డీమార్ట్ స్టోర్లను కంపెనీ ఆపరేట్ చేస్తోంది. అవెన్యూ సూపర్మార్ట్స్ షేర్లు శుక్రవారం అర శాతం పెరిగి రూ.3,840 వద్ద
క్లోజయ్యాయి.