మాజీ వైస్ ప్రెసిడెంట్కు 395 మంది మద్ధతు
శాండర్స్ కు సపోర్ట్ చేస్తున్నది 305 మందే
వాషింగ్టన్: ప్రెసిడెంట్ ఎన్నికల్లో పార్టీ తరఫున నిలబెట్టే అభ్యర్థి కోసం డెమోక్రాటిక్ పార్టీ నిర్వహిస్తున్న ప్రైమరీ ఎన్నికల్లో మాజీ వైస్ ప్రెసిడెంట్ జోయ్ బిడెన్ ముందంజలో ఉన్నారు. రాష్ట్రాల వారీగా జరుగుతున్న ప్రైమరీలలో మెజారిటీ చోట్ల బిడెన్ గెలుపొందారు. ప్రెసిడెంట్ పోటీలో నిలబడాలంటే మొత్తం 3979 డెమోక్రాట్ డెలిగేట్లలో 1991 డెలిగేట్ల ఓట్లు గెలుచుకోవాల్సి ఉండగా.. ప్రస్తుతం బిడెన్ 395 డెలిగేట్ల మద్దతు సంపాదించుకున్నారు. ఆయన పోటీదారు, సెనేటర్బెర్నీ శాండర్స్ కు 305 మంది మద్ధతు తెలిపారు. ప్రైమరీ రేసులో గెలుపొందిన వారు నవంబర్ 3న జరిగే ప్రెసిడెంట్ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి, ప్రస్తుత ప్రెసిడెంట్డొనాల్డ్ ట్రంప్తో పోటీపడతారు.
సూపర్ ట్యూస్డే హీరో బిడెన్
సూపర్ ట్యూస్ డే పేరుతో మంగళవారం 14 రాష్ట్రాల్లో ప్రైమరీ ఎన్నికలు జరగగా.. 1357 మంది డెలిగేట్లు ప్రెసిడెంట్ అభ్యర్థికి ఓటేశారు. ఇందులో వర్జీనియా, నార్త్ కరోలినా, అలబామా, ఓక్లహోమా, టెన్నెసీ, మిన్నెసోటా, మసాచుసెట్స్, అర్కన్సాస్ రాష్ట్రాల్లో బిడెన్ గెలుపొందారు. పెద్ద సంఖ్యలో డెలిగేట్లు ఉన్న కాలిఫోర్నియాతో పాటు వెర్మాంట్, యుటా, కొలరాడో రాష్ట్రాల ప్రైమరీలలో శాండర్స్ గెలిచారు. ఈ రేసులో లేట్గా ఎంట్రీ ఇచ్చిన న్యూయార్క్ మాజీ మేయర్ మైకెల్ బ్లూంబర్గ్ కేవలం అమెరికన్ సమోవా కాకస్లో మాత్రమే గెలిచారు. కాలిఫోర్నియా రేసులో శాండర్స్ తర్వాతి స్థానంలో నిలిచారు. ఎన్నికల ప్రచారం కోసం బ్లూంబర్గ్ భారీ మొత్తంలో ఖర్చు పెట్టారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ప్రెసిడెంట్ ట్రంప్ స్పందిస్తూ.. ప్రచారం కోసం 500 మిలియన్ డాలర్లు ఖర్చు చేసిన బ్లూంబర్గ్ఈ నాటి బిగ్గెస్ట్ లూజర్ అంటూ ట్వీట్ చేశారు. ప్రెసిడెంట్ రేసులో చివరకు తామే నిలుస్తామని, ప్రెసిడెంట్ ఎలక్షన్లో విజయం సాధిస్తామని బిడెన్, శాండర్స్ ఎవరికి వారే విశ్వాసం ప్రకటించారు. ఇండియన్ సంతతికి చెందిన తులసి గబ్బార్డ్ అమెరికన్ సమోవాలో, ప్రెస్టన్ కులకర్ణి టెక్సాస్ 22 డిస్ట్రిక్ట్ ప్రైమరీలో గెలుపొందారు. కులకర్ణి గతంలో ఇండియన్ అమెరికన్ డిప్లొమాట్గా పనిచేశారు.
బుష్ మనవడి ఓటమి
హ్యూస్టన్ కాంగ్రెషనల్ సీట్బరిలో నిలిచేందుకు జరిగిన ప్రైమరీలో మాజీ ప్రెసిడెంట్ జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ మనవడు పీర్స్ బుష్ ఓడిపోయారు. పార్టీ టికెట్ కోసం జరిగిన ఈ ఎన్నికల్లో పీర్స్ బుష్ పోటీ చేశారు. టెక్సాస్ నుంచి గతంలో పోటీ చేసిన బుష్ కుటుంబ సభ్యులు ఎవరూ ఓడిపోలేదు. హ్యూస్టన్లో ఓటమి తర్వాత బుష్ కుటుంబంలో ఓటమిని చవిచూసిన తొలి వ్యక్తిగా పీర్స్ బుష్ అప్రతిష్ట
మూటకట్టుకున్నారు.