క్వార్టర్స్‌‌‌‌లో సాత్విక్‌‌‑చిరాగ్‌‌ జోడీ

క్వార్టర్స్‌‌‌‌లో సాత్విక్‌‌‑చిరాగ్‌‌ జోడీ

పారిస్‌‌‌‌ : ఇండియా బ్యాడ్మింటన్‌‌ డబుల్స్‌‌ జోడీ సాత్విక్‌‌ సాయిరాజ్‌‌– చిరాగ్‌‌ షెట్టి.. ఫ్రెంచ్‌‌ ఓపెన్‌‌ సూపర్‌‌–750 టోర్నీలో క్వార్టర్‌‌ఫైనల్లోకి అడుగుపెట్టింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌‌లో ఏడో సీడ్‌‌ సాత్విక్‌‌–చిరాగ్‌‌ 21–16, 21–14తో మన్‌‌ వీ చోంగ్‌‌–కాయ్‌‌ వున్‌‌ టీ (మలేసియా)పై గెలిచారు. 40 నిమిషాల మ్యాచ్‌‌లో ఇండియన్‌‌ జంట.. రిటర్న్స్‌‌లో ఆకట్టుకుంది. తొలి గేమ్‌‌లో 6–6తో స్కోరు సమమైన తర్వాత ఎక్కడా వెనుదిరిగి చూసుకోలేదు. ఇక రెండో గేమ్‌‌లో బలమైన స్మాష్‌‌లు, ర్యాలీలతో ప్రత్యర్థులకు స్కోరును సమం చేసే అవకాశమే ఇవ్వలేదు.

మెన్స్‌‌ సింగిల్స్‌‌ ప్రిక్వార్టర్స్‌‌లో కిడాంబి శ్రీకాంత్‌‌ 21–19, 12–21, 19–21తో రాస్మస్‌‌ గిమ్కే (డెన్మార్క్‌‌) చేతిలో పోరాడి ఓడాడు. తొలి గేమ్‌‌లో 10–16తో వెనుకబడ్డ శ్రీ బాగా పుంజుకుని గేమ్‌‌ను సాధించాడు. కానీ రెండో గేమ్‌‌లో సత్తాచాటలేదు. నిర్ణయాత్మక మూడో గేమ్‌‌లో ఇద్దరు ప్రతి పాయింట్‌‌ కోసం హోరాహోరీగా పోటీపడ్డారు. లాస్ట్‌‌లో నెట్‌‌ వద్ద డ్రాప్స్‌‌ను తీయలేక శ్రీ ఓటమిపాలయ్యాడు. మరో మ్యాచ్‌‌‌‌లో సమీర్‌‌ వర్మ 18–21, 11–21తో విదిసరన్‌‌ కున్లావత్‌‌ (థాయ్‌‌లాండ్‌‌) చేతిలో ఓడాడు.