
బోధన్,వెలుగు: టీచర్లు విద్యార్థులకు సులభమైన పద్ధతిలో అర్థమయ్యే విధంగా బోధించాలని డీఈవో అశోక్ కుమార్ సూచించారు. గురువారం బోధన్ పట్టణంలోని రాకాసిపేట హైస్కూల్, యూపీఎస్, ప్రైమరీ స్కూళ్లలో ఎఫ్ఎల్ఎన్(ఫండమెంట్ లిటరసీ అండ్ న్యూమరసీ), టీఎల్ఎం(టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) మండల స్థాయి మేళా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలు సాధించేందుకు టీచర్లు కృషి చేయాలని సూచించారు. అనంతరం టీచర్లు తయారు చేసిన టీఎంఎల్ మేళాను ప్రదర్శించారు. ప్రతిభ కనబర్చినవారికి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందించారు. కార్యక్రమంలో ఎంఈవో నాగయ్య, కాంప్లెక్స్ హెచ్ఎంలు సూర్యకుమార్, ఆరీఫ్ ఉద్దీన్ పాల్గొన్నారు.