ప్రణాళికా బద్ధంగా ల్యాబ్లను నిర్వహించాలి : డీఈవో రాధాకిషన్ రావు

ప్రణాళికా బద్ధంగా ల్యాబ్లను నిర్వహించాలి : డీఈవో రాధాకిషన్ రావు

మెదక్​ టౌన్, వెలుగు: జిల్లాలో అటల్ టింకరింగ్ ల్యాబ్​లను ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలని డీఈవో రాధాకిషన్ రావు సూచించారు.  సోమవారం మెదక్ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల  స్కూల్​లో రెండు రోజుల శిక్షణా తరగతులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలోని 30 స్కూల్స్​లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్​ నిర్వహిస్తున్నామని ఇందులో భాగంగా సైన్స్, మ్యాథ్స్ ​టీచర్లకు  ల్యాబ్ నిర్వహణపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. టీచర్లు నిత్య జీవితంలో సైన్స్  ప్రాముఖ్యత గురించి వివరిస్తూ విద్యార్థులకు బోధించాలని సూచించారు. ఆయన వెంట కోర్స్ డైరెక్టర్  సుదర్శన్ మూర్తి, ప్రిన్సిపాల్ సువర్ణలత, రిసోర్స్ పర్సన్​ నవీన్, కిరణ్, టీచర్లు పాల్గొన్నారు.