బోర్డర్ దాటకుండానే పాక్ ఉగ్రవాద శిబిరాల ధ్వంసం

బోర్డర్ దాటకుండానే పాక్ ఉగ్రవాద శిబిరాల ధ్వంసం

భారత వైమానిక దళంలోకి రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చిన తర్వాత పాకిస్తాన్ లోని  టెర్రరిస్టుల అంతు చూస్తామన్నారు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్.  రాఫెల్ విమానాలతో వైమానిక దళ సామర్థ్యం మరింత బలపడుతుందన్నారు. విమానాలు చేతికి అందిన తర్వాత సరిహద్దులు దాటకుండానే పాక్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తామన్నారు. ప్రస్తుతం న్యూయార్క్‌లో  ఉన్న రాజ్‌నాథ్… భారత్-అమెరికా మధ్య జరగనున్న 2 ప్లస్ 2 చర్చల్లో పాల్గొననున్నారు.