
శ్రావణ మాస తొలి శుక్రవారం సందర్భంగా అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆయా అమ్మవారి ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో మహిళలు భారీగా పాల్గొన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని భద్రకాళీ ఆలయం, సంతోషిమాత, రాజరాజేశ్వరీ, పద్మాక్షమ్మ, భువనేశ్వరీ మాత టెంపుల్ లో నిర్వహించిన పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. - వెలుగు, వరంగల్ ఫొటోగ్రాఫర్