ప్రభుత్వ విప్ అడ్లూరి కారు బోల్తా: గడ్డం వంశీ కృష్ణ పరామర్శ

ప్రభుత్వ విప్ అడ్లూరి కారు బోల్తా: గడ్డం వంశీ కృష్ణ పరామర్శ
  • జగిత్యాల జిల్లా వెల్గటూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద ప్రమాదం
  • స్వల్ప గాయాలతో బయటపడిన లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వెల్గటూర్, వెలుగు: ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పెద్ద ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లిన విప్ లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోమవారం తెల్లవారుజామున తిరిగివస్తుండగా జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం, కొత్తపేట మధ్య ఉన్న టర్నింగ్ వద్ద లారీని తప్పించే క్రమంలో ఆయన కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో అడ్లూరి తలకు, కాళ్లకు, చేతులకు గాయాలయ్యాయి.

విషయం తెలుసుకున్న ఎస్సై ఉమా సాగర్ ఘటనా స్థలానికి చేరుకొని, విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు మిగిలిన వారిని కరీంనగర్ అపోలో హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించి, ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందించారు. ఆయనకు ప్రాణాపాయమేమీ లేదని డాక్టర్లు వెల్లడించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన డ్రైవర్ సంతోష్, గన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెన్లు ప్రశాంత్, సంతోష్ కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స  
పొందుతున్నారు.

కాంగ్రెస్ యువ నేత గడ్డం వంశీ కృష్ణ పరామర్శ..

యశోద హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చికిత్స పొందుతున్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కాంగ్రెస్ యువ నాయకుడు గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని, మళ్లీ ప్రజా సేవలో నిమగ్నం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు వంశీకృష్ణ తెలిపారు.