
- కార్యవర్గం కూర్పు.. కేబినెట్ విస్తరణపై డిస్కషన్!
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి బుధవారం తన నివాసంలో కేబినెట్ మంత్రులకు ప్రత్యేక డిన్నర్ ను ఏర్పాటు చేశారు. ఈ విందులో ఏఐసీసీ ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్తో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేబినెట్ విస్తరణ, కార్యవర్గం కూర్పుపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తున్నది. ప్రభుత్వ కార్యక్రమాలతో పార్టీ పరిస్థితి, నేతల ప్రెజర్ వంటివన్నీ మంత్రులకు సీఎం వివరించినట్లు తెలిసింది. జిల్లా, సామాజిక, రాజకీయ సమీకరణాల ఆధారంగా ఎవరికి కేబినెట్ లో స్థానం కల్పిస్తే బాగుంటుంది? అని చర్చకు వచ్చినట్లు సమాచారం.
దీంతో పాటు పార్టీ కార్యవర్గంపై కూడా మీనాక్షి నటరాజన్ తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. కమిటీ కూర్పు ఎలా ఉండాలనేది స్పష్టత ఇచ్చారు. దీనిపై కూడా మంత్రులు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచినట్లు సమాచారం. జూన్ ఫస్ట్ వీక్ లోపు కేబినెట్ విస్తరణ, కార్యవర్గం ప్రకటించే ఛాన్స్ ఉన్నదని కాంగ్రెస్వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ ఏఐసీసీ ఆఫీస్లో పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన త్వరలో జరిగే మీటింగ్కు సీఎం, పీసీసీ చీఫ్ హాజరు కానున్నారు